Operation Akarsh‌: మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు సిద్ధమైన బీజేపీ

ABN , First Publish Date - 2022-07-25T17:04:22+05:30 IST

కమలం నేతలు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌ (Operation Akarsh)కు సిద్ధమయ్యారు.

Operation Akarsh‌: మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు సిద్ధమైన బీజేపీ

హైదరాబాద్ (Hyderabad)‌: కమలం నేతలు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌ (Operation Akarsh)కు సిద్ధమయ్యారు. జిల్లాల వారీగా చేరికలపై బీజేపీ (BJP) నాయకత్వం దృష్టి సారించింది. ఈ చేరికలను  జాతీయ నాయకత్వం స్వయంగా పర్యవేక్షిస్తోంది. చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etala Rajendar)ను నియమించింది. పార్టీలో పాత, కొత్త నేతలకు బాధ్యతలు అప్పజెప్పింది. చేరికలతో టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్‌ (Congress)కు చెక్ పెట్టాలని బీజేపీ నేతల ఆలోచన. బీజేపీ అధినాయకత్వంతో పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలియవచ్చింది.


కాగా ఆగస్ట్ 2వ తేదీ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మూడోవిడత పాదయాత్ర (Padayatra) చేయనున్నారు. పాదయాత్ర సమయంలో తెలంగాణకు.. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలు రానున్నారు. సీఎంలు, కేంద్రమంత్రుల సమక్షంలో పలువురు నేతలకు కాషాయ కండువా కప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2022-07-25T17:04:22+05:30 IST