Pegasus row: పార్లమెంట్లో విపక్షాల భేటీ
ABN , First Publish Date - 2021-07-20T16:05:48+05:30 IST
పెగాసస్’ స్పైవేర్ వివాదం అధికార,విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలకు దారితీస్తోంది. పెగాసస్ స్పైవేర్ జాబితాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్
న్యూఢిల్లీ : ‘పెగాసస్’ స్పైవేర్ వివాదం అధికార,విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలకు దారితీస్తోంది. పెగాసస్ స్పైవేర్ జాబితాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేరు కూడా ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ మరింత తీవ్రమైన దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో మంగళవారం విపక్ష సభ్యులందరూ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ‘పెగాసస్’ కేంద్రంగానే ఈ సమావేశం కొనసాగుతుందని సమాచారం. మరోవైపు రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పెగాసస్ ప్రాజెక్టు మీడియా నివేదిక వ్యవహారంపై జీరో అవర్ నోటీసు ఇవ్వనున్నారు. ఇక కాంగ్రెస్ తరపున ఎంపీ మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.