Rahul gandhi : సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే... మరో మాటే లేదు

ABN , First Publish Date - 2021-08-06T20:04:38+05:30 IST

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రైతులకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బృందం మద్దతు ప్రకటించింది.

Rahul gandhi : సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే... మరో మాటే లేదు

న్యూఢిల్లీ : సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రైతులకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బృందం మద్దతు ప్రకటించింది. వారితో పాటు ఇతర విపక్ష నేతలు కూడా రైతులకు మద్దతు పలికారు. జూలై 22 నుంచి ‘కిసాన్ సంసద్’’ (రైతుల పార్లమెంట్) పేరుతో రైతులు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విపక్ష నేతలందరూ ‘‘సేవ్ ఫార్మర్స్... సేవ్ ఇండియా’’ అన్న నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... రైతులకు మద్దతుగా విపక్షాలన్నీ కలిసి వచ్చాయని అన్నారు. నూతన సాగు చట్టాలను కేంద్రం రద్దు చేయాల్సిందేనని, ఇందులో మరో మాటకు తావే లేదని రాహుల్ తేల్చి చెప్పారు. 


Updated Date - 2021-08-06T20:04:38+05:30 IST