ప్రతిపక్ష సర్పంచ..!
ABN , First Publish Date - 2022-07-02T06:47:34+05:30 IST
చెట్టుకింద కుర్చీలో కూర్చున్న ఈమె పేరు విజయలక్ష్మి. టీడీపీ మద్దతుతో గుమ్మఘట్ట సర్పంచగా గెలిచారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్లిన ఆమెను అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు.
చెట్టుకింద కుర్చీలో కూర్చున్న ఈమె పేరు విజయలక్ష్మి. టీడీపీ మద్దతుతో గుమ్మఘట్ట సర్పంచగా గెలిచారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్లిన ఆమెను అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు. ఎప్పుడు వెళ్లినా తనకు సచివాలయంలో ఓ కుర్చీ కూడా వేయరని సర్పంచ అన్నారు. అందుకే ఇలా సచివాలయం బయట ఓ కుర్చీ వేసుకుని, ప్రజలకు సేవలు అందిస్తున్నానని తెలిపారు. ఈ విషయం ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, ప్రతిపక్షం మద్దతుతో గెలిచినందుకు ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా ప్రతినిధికి కనీస గౌరవం దక్కకపోవడం విమర్శలకు తావిస్తోంది.
- గుమ్మఘట్ట