జవహర్నగర్లో భూ కబ్జాలపై విచారణకు ఆదేశం
ABN , First Publish Date - 2022-01-25T22:58:08+05:30 IST
నగరంలోని జవహర్నగర్లో భూ కబ్జాలపై ఏబీఎన్ ఛానల్ ప్రసారం
హైదరాబాద్: నగరంలోని జవహర్నగర్లో భూ కబ్జాలపై ఏబీఎన్ ఛానల్ ప్రసారం చేసిన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. అంతర్గత విచారణకు అధికారులు ఆదేశించారు. ఇప్పటికే బల్లి శ్రీను కబ్జా చేసిన ప్రభుత్వ భూములను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. బల్లి శ్రీను భూ కబ్జా వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ఓ వైపు భూ కబ్జాలపై అధికారుల విచారణ కొనసాగుతుండగానే కబ్జా భూములను బల్లి శ్రీను యథావిధిగా అమ్మే ప్రయత్నం చేస్తోన్నాడు. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని అధికారులు కోరారు.