ఓర్వకల్లులో అదుపుతప్పి డివైడర్‎ను ఢీకొట్టిన ప్రైవేట్ స్కూల్ బస్సు..

ABN , First Publish Date - 2022-08-26T15:46:47+05:30 IST

ఓర్వకల్లు మండలంలో పెను ప్రమాదం తప్పింది. సోమయాజులపల్లి సమీపంలో జాతీయ రహదారి ఘాట్‎లో రోడ్డు ప్రమాదం...

ఓర్వకల్లులో అదుపుతప్పి డివైడర్‎ను ఢీకొట్టిన ప్రైవేట్ స్కూల్ బస్సు..

కర్నూలు: ఓర్వకల్లు మండలంలో పెను ప్రమాదం తప్పింది. సోమయాజులపల్లి సమీపంలో జాతీయ రహదారి ఘాట్‎లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు విద్యార్థులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సోమయాజులపల్లి నుంచి పాణ్యం వెళ్తుండగా చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అక్కడి స్థానికులు చెబుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-08-26T15:46:47+05:30 IST