ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటుచేయాలి

ABN , First Publish Date - 2021-05-10T06:02:48+05:30 IST

కోనసీమలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్షణం ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోనసీమ జేఏసీ కార్యవర్గ సమావేశం డిమాండ్‌ చేసింది.

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటుచేయాలి

అమలాపురం టౌన్‌, మే 9: కోనసీమలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్షణం ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోనసీమ జేఏసీ కార్యవర్గ సమావేశం డిమాండ్‌ చేసింది. జేఏసీ చైర్మన్‌ వాసా ఎస్‌ దివాకర్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణానికి కొత్తగా స్థల సేకరణ జరిపి వాటి పనులు చేపట్టేందుకు మూడు నెలల వ్యవధిపట్టే పరిస్థితి ఉన్నందున అన్ని ప్రభుత్వాసు పత్రుల్లో తక్షణం ప్లాంట్లు ఏర్పాటుచేసే విధంగా చమురు సంస్థలు చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు. కొవిడ్‌ బాధి తులకు అన్ని మండలాల్లోను ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇప్పటికే కోనసీమలోని ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, చమురు సంస్థల యాజమా న్యాలకు వినతిపత్రాలు అందించడం జరిగిందన్నారు. ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణం చేపట్టకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగు తామని హెచ్చరించారు. సమావేశంలో కన్వీనర్‌ బండారు రామ్మోహనరావు, కోకన్వీనర్లు యిళ్ల భక్తవత్సలం, మంత్రిప్రగడ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T06:02:48+05:30 IST