‘ఓటీఎస్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’
ABN , First Publish Date - 2021-12-05T04:57:42+05:30 IST
ఓటీఎస్ ద్వార ప్రజలకు జరిగే ప్రయోజనాలను వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉద్యోగులపై ఉందని జేసీ రాంసుందర్రెడ్డి అన్నారు.
ఎమ్మిగనూరు, డిసెంబరు 4: ఓటీఎస్ ద్వార ప్రజలకు జరిగే ప్రయోజనాలను వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉద్యోగులపై ఉందని జేసీ రాంసుందర్రెడ్డి అన్నారు. తహసీల్దార్ కార్యాలయం లో శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిచారు. 1983 నుంచి 2011 వరకు ప్రభుత్వం ద్వార గృహాలు నిర్మించుకున్న వారు ప్రభుత్వం నకు రూ. 10వేలు చెల్లిస్తే ప్రభుత్వం ఆ గృహా యజమాని పేరుపై డిశంబరు 21న రిజిస్ర్టేషన్ పత్రాలు అందజేస్తామన్నారు. దీని వల్ల శాశ్విత గృహ హక్కు పొందుతాని తెలిపారు. ఈ పథకం గురించి ఇప్పటికే ప్రతి గ్రామంలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సర్వేల చేస్తున్నారని ఆయన తెలిపారు. కావున ప్రతి గ్రామంలోని సచివాల ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులలో చైతన్యం తీసుకువచ్చి వారిచేత ఓటీఎస్ కింద రూ.10 వేలు చేల్లించేలా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామకృష్టారెడ్డి, తహసీల్దార్ జయన్న, మున్సిపల్ కమీషనర్ కృష్టా, ఎంపీడీవో బంగారమ్మ, పలు శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.