మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2022-03-03T22:36:59+05:30 IST

తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులేనని మంత్రి

మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు: మంత్రి బొత్స

అమరావతి: తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ చట్టం ఇంకా అమల్లోనే ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే తమ ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నారు. చట్టాలు చేసేందుకే అసెంబ్లీ, పార్లమెంట్‌లు ఉన్నాయన్నారు. సమాజ అభివృద్ధి కోసం తాము ఆలోచిస్తున్నామన్నారు. చంద్రబాబు తన సామాజిక అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచిస్తున్నారని బొత్స విమర్శించారు. 

Updated Date - 2022-03-03T22:36:59+05:30 IST