రాష్ట్రాల వద్ద 20.16 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు

ABN , First Publish Date - 2022-04-21T18:14:17+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 20.16 కోట్లకు పైగా బ్యాలెన్స్,ఉపయోగించని కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని...

రాష్ట్రాల వద్ద 20.16 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు

ఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 20.16 కోట్లకు పైగా బ్యాలెన్స్,ఉపయోగించని కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం తన అధికారిక ప్రకటనలో తెలిపింది.‘‘భారత ప్రభుత్వం ఇప్పటివరకు 192.27 కోట్ల కంటే ఎక్కువ కొవిడ్ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించాం’’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం గత ఏడాది జనవరి 16వతేదీన ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా, భారత ప్రభుత్వం రాష్ట్రాలు, యుటీలకు కొవిడ్ వ్యాక్సిన్‌లను ఉచితంగా అందించింది.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ల లభ్యతను బట్టి  టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది. 


Updated Date - 2022-04-21T18:14:17+05:30 IST