ప్రమాదం అంచున ఓవర్ హెడ్ ట్యాంకు
ABN , First Publish Date - 2021-05-10T06:58:58+05:30 IST
అడ్డగూడూరు ఎస్సీకాలనీ (మర్రిగడ్డ)లో ఉన్న ఓవ ర్హెడ్ మంచినీటి ట్యాంక్ చువ్వలు తేలి ప్రమాదకరంగా ఉందని ఓయూ జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ బాబూ మహా జన్ అన్నారు.
అడ్డగూడూరు ఎస్సీకాలనీ (మర్రిగడ్డ)లో..
మోత్కూరు, మే 9: అడ్డగూడూరు ఎస్సీకాలనీ (మర్రిగడ్డ)లో ఉన్న ఓవ ర్హెడ్ మంచినీటి ట్యాంక్ చువ్వలు తేలి ప్రమాదకరంగా ఉందని ఓయూ జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ బాబూ మహాజన్ అన్నారు. ఆదివారం మోత్కూరు లోని ఎస్సీ కాలనీలో ఆయన మాట్లా డారు. ట్యాంక్ అడుగు భాగంలో పిల్లర్లు, బీంల పెచ్చులూడి, ఇనుప చువ్వలు బయటికి తేలాయన్నారు. ట్యాంకును నిత్యం నీటితో నింపుతు న్నందున ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు భయ పడుతున్నారన్నారు. ఆ ట్యాంకు ద్వా రా వచ్చే నీటితో స్నానాలు చేస్తే శరీరమంతా దుద్దర్లు వస్తున్నాయన్నా రు. అధికారులు నీటిని పరీక్ష చేయించడంతో పాటు శిథిలావస్థలో ఉన్న ట్యాంకును తొలగించి నూతన ట్యాంకును నిర్మించాలని ఆయన కోరారు.