భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2021-10-27T05:18:14+05:30 IST

భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రూ.కోటి ఖర్చుతో ఏర్పాటు చేసిన మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను మంత్రి శ్రీరంగనాథరాజు మంగళవారం ప్రారంభించారు.

భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌
ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభిస్తున్న మంత్రి శ్రీరంగనాథరాజు

భీమవరం, అక్టోబరు 26 : భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రూ.కోటి ఖర్చుతో ఏర్పాటు చేసిన మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను మంత్రి శ్రీరంగనాథరాజు మంగళవారం ప్రారంభించారు. కృష్ణా జిల్లా బొమ్ములూరుకు చెందిన దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫీడ్స్‌ అధినేత అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం  అం దించిన ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు. దాత సుబ్రహ్మణ్యం, సహకరించిన నడింపల్లి వెంకట రామరాజును సత్కరించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌,ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు, ఏఎంసీ చైర్మన్‌ తిరుమాని ఏడు కొండలు,ఎంపీపీ విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు,గౌడ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కామన నాగేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-27T05:18:14+05:30 IST