పాతిశప్త పిత

ABN , First Publish Date - 2021-01-09T15:58:38+05:30 IST

సేమ్యా లేదా రవ్వ - పావుకేజీ, మైదా - 400 గ్రా, పంచదార 200గ్రా, కోవా - 300గ్రా, నూనె - సరిపడా, పాలు - ఒక లీటరు.

పాతిశప్త పిత

సంప్రదాయ బెంగాలీ వంటకం ఇది.


కావలసినవి: సేమ్యా లేదా రవ్వ - పావుకేజీ, మైదా - 400 గ్రా, పంచదార 200గ్రా, కోవా - 300గ్రా, నూనె - సరిపడా, పాలు - ఒక లీటరు.


తయారీ విధానం: ముందుగా పాలను బాగా మరిగించాలి. పాలు చిక్కగా అవుతున్న సమయంలో కోవా, కొద్దిగా పంచదార వేసి చిక్కటి పేస్టులా అయ్యేలా చేసుకోవాలి. మరొక పాత్రలో మైదా పిండి తీసుకుని అందులో రవ్వ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. మిగిలిన పంచదార వేయాలి. స్టవ్‌పై ఫ్రై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక కొద్దిగా నూనె వేసుకుంటూ రవ్వ, మైదా పిండి మిశ్రమాన్ని దోశలా పోయాలి. తరువాత చిక్కటి పేస్టులా చేసుకున్న కోవా మిశ్రమాన్ని పైన వేసి రోల్‌లా చుట్టాలి. గోధుమరంగులోకి మారే వరకు కాల్చి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-01-09T15:58:38+05:30 IST