టీటీడీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: పయ్యావుల

ABN , First Publish Date - 2022-04-13T19:23:58+05:30 IST

తిరుమలలో భక్తుల ఇబ్బందులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు.

టీటీడీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: పయ్యావుల

అమరావతి: తిరుమలలో భక్తుల ఇబ్బందులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... లక్ష మందికి ఏర్పాట్లు చేయగలిగే టీటీడీ.... ఇప్పుడు భక్తులకు చలువ పందిళ్ళు కూడా ఎందుకు వెయ్యలేదని ప్రశ్నించారు. కొండమీద 1500 గదులు కేటాయించక పోవడానికి కారణం ఏంటని నిలదీశారు. సీఎం వస్తారని టీటీడీ జేఈవో ఎప్పుడో పోయి ఒంటిమిట్టలో కూర్చున్నారని మండిపడ్డారు. అసంబద్ధ నిర్ణయాల వల్లనే ఈ ఇబ్బందులు అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా తిరుమల కోసం అంతా పోరాడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. కొండ మీద పరిస్థితి చుసి ఇతర ప్రాంతాలలోని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. టీటీడీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని... భక్తులు సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి తీసుకురావాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-13T19:23:58+05:30 IST