శాంతించిన గోదావరి

ABN , First Publish Date - 2021-07-27T07:09:25+05:30 IST

ఉగ్ర గోదావరి శాంతించింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద సోమవారం మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 31.44 మీటర్లు ఉంది

శాంతించిన గోదావరి

ధవళేశ్వరం వద్ద మొదటి హెచ్చరిక ఉపసంహరణ

సముద్రంలోకి 7,76,223 క్యూసెక్కుల ప్రవాహం


రాజమహేంద్రవరం, పోలవరం, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఉగ్ర గోదావరి శాంతించింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద సోమవారం మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 31.44 మీటర్లు ఉంది. స్పిల్‌వే గుండా 5,69,976 క్యూసెక్కుల నీరు కిందకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 7,76,223 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతోంది. పోలవరం ముంపు గ్రామాల్లో వరద నెమ్మదిగా తగ్గుతోంది. కోనసీమ లంకల్లో వరద ఎక్కువగానే ఉంది. భద్రాచలం వద్ద 32.74 అడుగుల నీటిమట్టం ఉంది. పోలవరంలో గోదావరి నీట్టిమట్టం పెరగడంతో కడెమ్మ స్లూయిజ్‌గేట్లు పూర్తిగా మునిగిపోయాయి. ప్రాజెక్టు ఎగువన ఉన్న గ్రామాలు నీట మునిగాయి. తల్లవరం, గాజులగొంది, పెద్దూరు, వాడపల్లి గ్రామాల ప్రజలు తాత్కాలిక నివాసాల్లోకి చేరుకున్నారు. అధికారులు ముంపు గ్రామాలకు నిత్యవసరాలు, దోమల కాయి ల్స్‌, జనరేటర్లకు ఆయిల్‌, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Updated Date - 2021-07-27T07:09:25+05:30 IST