బహుళార్థక సేవాకేంద్రాలుగా పీఏసీఎ్సలు
ABN , First Publish Date - 2021-07-28T06:29:25+05:30 IST
ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలన్నీ బహుళార్థక సేవాకేంద్రాలుగా మారనున్నాయని డీసీసీబీ చైర్మన్, టెస్కా బ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు.
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి
యాదాద్రి రూరల్, జూలై 27: ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలన్నీ బహుళార్థక సేవాకేంద్రాలుగా మారనున్నాయని డీసీసీబీ చైర్మన్, టెస్కా బ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని వంగపల్లి పీఏసీఎస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాలకవర్గం సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాలు ఆర్థికంగా బలపడేందు కు ఈ బహుళార్థక సేవా కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. నాబార్డు సహకారంతో అర్హత పొందిన సంఘాలకు రూ.2కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ రుణాన్ని సక్రమం గా వినియోగించుకొని,సకాలంలో చెల్లిస్తే వడ్డీ రాయితీ లభిస్తుందన్నారు.నాబార్డు రుణాలతో గోదాములు, రైస్మిల్లులు, పెట్రోబంక్లు ఏర్పాటు చేసుకొని వాటిద్వారా ఆదాయాన్ని పొందవచ్చన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈవో మదన్మోహన్, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు బిజినెస్ డెవల్పమెంట్ ఆఫీసర్ మనీకాంతి, ఏజీఎం ఉదయ్శ్రీ, స్థానిక సంఘం వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మునిసిపాలిటీ పరిధిలోని కొత్తగుండ్లపల్లి గ్రామానికి చెందిన సూదగాని ఉమాభవాని కుటుంబసభ్యులకు రూ.1లక్ష ఎల్వోసీని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అందజేశారు. ఉమాభవాని అనారోగ్యంతో కొంతకాలంగా నిమ్స్లో చికిత్సపొందుతోంది.