Padayatra: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర

ABN , First Publish Date - 2022-08-10T15:37:45+05:30 IST

దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌(Congress) ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. తిరువళ్లూర్‌ జిల్లా ఎల్లాపురం

Padayatra: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర

గుమ్మిడి పూండి(చెన్నై), ఆగస్టు 9: దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌(Congress) ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. తిరువళ్లూర్‌ జిల్లా ఎల్లాపురం యూనియన్‌ పెరియపాళయంలోని భవానీ అమ్మన్‌(Bhavani Amman) ఆలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏజీ చిదంబరం ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభమైన పాదయాత్ర గుమ్మిడిపూండిలో ముగియనుంది. పాదయాత్రలో ప్రజలను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషిచేస్తామని పొన్నేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దురై చంద్రశేఖర్‌, మహిళా విభాగం కార్యదర్శి సుధ, న్యాయవాది సంపత్‌ తదితరులు తెలిపారు.

Updated Date - 2022-08-10T15:37:45+05:30 IST