విద్యుదాఘాతంతో వరికోత మిషన్‌ డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2022-05-22T06:00:19+05:30 IST

నార్సింగి మండల కేంద్రంలోని ఓ పొలం వద్ద వరి కోత మిషన్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్లు తగిలి డ్రైవర్‌ మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో వరికోత మిషన్‌ డ్రైవర్‌ మృతి

చేగుంట, మే 21: నార్సింగి మండల కేంద్రంలోని ఓ పొలం వద్ద వరి కోత మిషన్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్లు తగిలి డ్రైవర్‌ మృతి చెందాడు. కొల్చారం మండలం లింగాపూర్‌ చెందిన వెంకట్‌ యాదవ్‌(26) వరికోత మిషన్‌కు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఆదివారం చేగుంట మండలం నార్సింగికి చెందిన ఎరుకల ఉప్పలయ్య పొలంలో వరికోత మిషన్‌ను నడిపిస్తుండగా పైనుంచి  వేలాడుతున్న వైర్లు ప్రమాదవశాత్తు కోతమిషన్‌కు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురైన వెంకట్‌ యాదవ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తు మరణించడంతో వరికోత మిషన్‌ యజమాని నష్టపరిహారం చెల్లించాలంటూ మృతుడి బంధువులు డిమాండ్‌ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్‌ఐ నర్సింహులు తెలిపారు. 

Updated Date - 2022-05-22T06:00:19+05:30 IST