ధాన్యం బకాయిలు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-07-27T06:28:14+05:30 IST

ధాన్యం బకాయిలు చెల్లించాలి

ధాన్యం బకాయిలు చెల్లించాలి
చందర్లపాడు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు

చందర్లపాడు, జూలై 26: అమ్మిన పంటకు సొమ్ము ఇవ్వకపోగా, పంట నష్టం సొమ్మును కూడా లూఠీ చేసి రైతులను ఇబ్బంది పెడతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హెచ్చరించారు. ధాన్యం చెల్లింపులతో పాటు పంట నష్టం సొమ్మును రైతులకు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో చందర్లపాడులో ఆందోళన చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళనకు హాజరయ్యారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించకపోగా, ధాన్యం సొమ్ము కూడా చెల్లించకపోవడం హేయమని సౌమ్య అన్నారు. తక్షణమే రైతులకు ధాన్యం సొమ్ము చెల్లించాలని లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇన్సూరెన్స్‌ కంపెనీలు చెల్లించే పంట నష్టం సొమ్మును ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి రైతులకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కోట వీరబాబు, బండారు హనుమంతురావు, మేకల సుధాకర్‌బాబు, గుత్తికొండ రాంబాబు, నల్లాని ప్రభాకర్‌, జేవీ శ్రీనివాసరావు, కల్లూరి గోవిందరావు, దుద్దుకూరి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T06:28:14+05:30 IST