తిమ్మానగర్తండా బురద రోడ్డుపై వరి నాట్లు
ABN , First Publish Date - 2021-07-25T05:45:47+05:30 IST
మండలంలోని తిమ్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మనగర్తండా రోడ్డంతా వర్షానికి బురదమయమైంది.
పిట్లం, జూలై 24: మండలంలోని తిమ్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మనగర్తండా రోడ్డంతా వర్షానికి బురదమయమైంది. దీంతో కాంగ్రెస్ నాయకులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ మండల అఽధ్యక్షుడు రాంరెడ్డి మాట్లాడుతూ తిమ్మనగర్ తండా రోడ్డు గుండా నిత్యం మార్థండ, కంబాపూర్, సరి హద్దు గ్రామాలకు రాకపోకలు సాగిస్తారని, బురదమయమైన రోడ్డుతో అవస్థలు పడుతున్నారని తెలిపారు. రోడ్డంతా బురదమయమైనా నేటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నిమోజకవర్గ యువజన అధ్యక్షుడు ఆ మ్రోజ్, యువజన మండల అధ్యక్షుడు ప్రవీణ్, గిరిజన అధ్యక్షుడు రాజు, నాయకు లు మమ్మద్, నరేష్, గంగాధర్, ప్రశాంత్, జీయ, మోసిన్ తదితరులు ఉన్నారు.