ఎంజీ ఆటోమోటివ్తో పద్మజా గ్రీన్టెక్ జట్టు!
ABN , First Publish Date - 2022-05-17T06:15:00+05:30 IST
బస్ బిల్డింగ్ కంపెనీ ఎంజీ ఆటోమోటివ్కు కాంట్రాక్టు పద్ధతిలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు పద్మజా గ్రీన్టెక్ వ్యవస్థాపకుడు అమిత్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బస్ బిల్డింగ్ కంపెనీ ఎంజీ ఆటోమోటివ్కు కాంట్రాక్టు పద్ధతిలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు పద్మజా గ్రీన్టెక్ వ్యవస్థాపకుడు అమిత్ రెడ్డి వెల్లడించారు. వాయు మోటార్ బ్రాండ్తో ఎలక్ట్రికల్ వెహికల్స్ను పద్మజా గ్రీన్టెక్ తయారు చేస్తోంది. ఇప్పటికే సిటీ స్పీడ్ స్కూటర్ ‘రెట్రో’ను తెలంగాణలో గ్రీన్టెక్ విక్రయిస్తోంది. వచ్చే ఆరు నెలల్లో పెర్ఫార్మెన్స్ స్కూటర్, బైక్లను విడుదల చేయనున్నట్లు అమిత్ తెలిపారు.