పద్మక్క ఆశయాలు సాధించాలి
ABN , First Publish Date - 2021-10-18T05:38:56+05:30 IST
ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర వహిం చిన సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకురాలు తాళ్లూరి పద్మ ఆశయ సాధనకు కృషిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ జేవీ. చలపతిరావు పిలుపునిచ్చారు. మండలంలోని వెలిదండలో ఆదివారం జరిగిన పద్మక్క అంతిమయాత్రలో పాల్గొని మాట్లాడారు. వీర తెలం గాణ సాయుధ పోరాట వారసత్వం
గరిడేపల్లి రూరల్, అక్టోబరు 17: ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర వహిం చిన సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకురాలు తాళ్లూరి పద్మ ఆశయ సాధనకు కృషిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ జేవీ. చలపతిరావు పిలుపునిచ్చారు. మండలంలోని వెలిదండలో ఆదివారం జరిగిన పద్మక్క అంతిమయాత్రలో పాల్గొని మాట్లాడారు. వీర తెలం గాణ సాయుధ పోరాట వారసత్వం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన పద్మక్క అనే విప్లవ పోరాటాలకు అండగా నిలిచారని కొనియాడారు. దోపిడీ, పీడన అణచివేత లేని సమాజం పోరాడుతున్న అనేకమంది విప్లవకారులకు తన ఇంటిని ఉద్యమ పాఠవాలగా మార్చి చైతన్యం అందించారని అన్నారు. కార్యక్రమంలో ఇఫ్టూ జాతీయ కార్యదర్శి పి.ప్రసాద్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, అఖిల భారత రైతు కూలీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వి. కోటేశ్వరరావు, నాయకులు రాయి కృష్ణ, ఎం. డేవిడ్కుమార్, వీసాల వెంకటేశ్వర్లు, అంబటి నాగయ్య, కాకి భాస్కర్, సర్పంచ్ ఆదూరి పద్మ కోటయ్య, పోటు లక్ష్మయ్య, కామళ్ల నవీన్, ఉదయగిరి పాల్గొన్నారు.