పైడితల్లి అమ్మవారి తలయారి మృతి

ABN , First Publish Date - 2021-01-22T15:18:40+05:30 IST

జిల్లాలోని విజయనగరం పట్టణంలో గల ప్రఖ్యాత పైడితల్లి అమ్మవారి ఆలయ తలయారి రామవరపు పైడిరాజు మృతి చెందారు.

పైడితల్లి అమ్మవారి తలయారి  మృతి

విజయనగరం: జిల్లాలోని విజయనగరం పట్టణంలో గల ప్రఖ్యాత పైడితల్లి అమ్మవారి ఆలయ తలయారి రామవరపు పైడిరాజు మృతి  చెందారు. పూర్వ కాలం నుంచి సిరిమానోత్సవాలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భక్తులందరికీ  పైడిరాజు సుపరిచితులే. అమ్మవారికి ప్రతిరోజు నిష్ఠగా పూజలు చేసేవారు. పూజారి మృతితో భక్తులు తీవ్ర ఆవేదన  చెందుతోన్నారు. 

Updated Date - 2021-01-22T15:18:40+05:30 IST