5న పైలం సంతోష్‌ సంతాప సభ

ABN , First Publish Date - 2020-12-02T06:01:02+05:30 IST

ప్రజాగాయకుడు పైలం సంతోష్‌ సంతాప సభను ఈనెల 5న నల్లగొండ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రజాగళం రాష్ట్ర కన్వీనర్‌ తాటిపాములు శంకర్‌, జిల్లా అధ్యక్షుడు నకిరేకంటి సైదులు తెలిపారు.

5న పైలం సంతోష్‌ సంతాప సభ

నల్లగొండ కల్చరల్‌, డిసెంబరు 1: ప్రజాగాయకుడు పైలం సంతోష్‌ సంతాప సభను ఈనెల 5న నల్లగొండ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించనున్నట్లు  తెలంగాణ ప్రజాగళం రాష్ట్ర కన్వీనర్‌ తాటిపాములు శంకర్‌, జిల్లా అధ్యక్షుడు నకిరేకంటి సైదులు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో సంతాప సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కవులు, కళాకారులు హాజరై విజవంతం చే యాలని కోరారు. కార్యక్రమంలో కవులు వేముల ఎల్లయ్య, భీమార్జన్‌రెడ్డి, మాతంగి ధర్మయ్య పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-02T06:01:02+05:30 IST