29న ఆన్లైన్లో పెయింటింగ్ పోటీలు
ABN , First Publish Date - 2021-07-27T06:06:52+05:30 IST
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు పెయింటింగ్ పోటీలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టు జూ క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరిలోవ, జూలై 26: ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు పెయింటింగ్ పోటీలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టు జూ క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక కేటగిరిగా, ఆరు నుంచి పదో తరగతి వరకు రెండో కేటగిరిగా, ఇంటర్ నుంచి ఆపై తరగతులకు మూడో కేటగిరిగా పోటీలు నిర్వహిస్తామన్నారు. అలాగే పులుల జీవన విధానంపై ఆన్లైన్లో క్విజ్ కూడా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు జూ వెబ్సైట్లో 29వ తేదీ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లాగిన్ అయి క్విజ్ పోటీలో పాల్గొనవచ్చునన్నారు. మరిన్ని వివరాలకు 9441130894, 9440810213 సెల్ నంబర్లను సంప్రతించాలని కోరారు.