టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్కు షోయబ్ మాలిక్
ABN , First Publish Date - 2020-08-08T03:29:46+05:30 IST
పాక్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ ఇంగ్లాండ్ బయలుదేరనున్నాడు. ఆగస్టు 28 నుంచి పాక్-ఇంగ్లాండ్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్...
ఇస్లామాబాద్: పాక్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ ఇంగ్లాండ్ బయలుదేరనున్నాడు. ఆగస్టు 28 నుంచి పాక్-ఇంగ్లాండ్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్లో మాలిక్ ఆడనున్నాడు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఆగస్టు 15న ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. అయితే ఇంగ్లాండ్ వెళ్లేముందు అతడికి నిబంధనల ప్రకారం రెండు సార్లు కరోనా పరీక్ష నిర్వహించనున్నట్లు పాకీస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తెలిపింది. ఆ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్ రావాల్సి ఉందని, అప్పుడే మాలిక్ను ఇంగ్లాండ్ వెళ్లేందుకు అనుమతిస్తామని పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంగ్లాండ్-పాకీస్తాన్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. మొత్తం మూడు టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సిరీస్ అనంతరం టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 ఆగస్టు 28న జరగనుండగా.. రెండో మ్యాచ్ ఆగస్టు 30, మూడో టీ20 సెప్టెంబరు 1న జరగనుంది.