IndiavsPakistan: టాస్ గెలిచిన పాకిస్తాన్.. కీలక మార్పులతో బరిలోకి భారత్
ABN , First Publish Date - 2022-09-05T00:46:52+05:30 IST
ఆసియా కప్ 2022(asia cup)లో కీలక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India Vs Pakistan) మ్యాచ్లో టాస్ పడింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
దుబాయ్: ఆసియా కప్ 2022(asia cup)లో కీలక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India Vs Pakistan) మ్యాచ్లో టాస్ పడింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. కాగా ఈ మ్యాచ్లో భారత్ కీలక మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులో హార్ధిక్ పాండ్యాతోపాటు రిషబ్ పంత్(వికెట్ కీపర్) దీపక్ హుడా, రవి బిష్ణోయ్లకు చోటు కల్పించింది. దక్కింది. కాగా గాయం కారణంగా రవీంద్ర జడేజా జట్టుకు దూరమవ్వగా.. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్కు చోటుదక్కింది. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న ఆవేశ్ ఖాన్ను కూడా పక్కనపెట్టారు.
తుది జట్లు:
India (Playing XI): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్.
Pakistan (Playing XI): మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజమ్(కెప్టెన్), ఫకర్ జమాన్, ఖుష్దిల్ షా, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరిస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్, నషీమ్ షా.