ఆ పావురాన్ని భారత్ వెనక్కి ఇచ్చేయాలి: పాక్ వాసి విన్నపం

ABN , First Publish Date - 2021-04-22T18:22:36+05:30 IST

పాకిస్తాన్ సరిహద్దు నుంచి పంజాబ్‌ బోర్డర్‌కు వచ్చిన తన పావురాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్‌కు చెందిన హబీబుల్లా విజ్ఞప్తి చేశాడు.

ఆ పావురాన్ని భారత్ వెనక్కి ఇచ్చేయాలి: పాక్ వాసి విన్నపం

పాకిస్తాన్ సరిహద్దు నుంచి పంజాబ్‌ బోర్డర్‌కు వచ్చిన తన పావురాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్‌కు చెందిన హబీబుల్లా విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 17వ తేదీన పంజాబ్‌ బోర్డర్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ నీరజ్ కుమార్ భుజంపై ఓ పావురం వాలింది. ఆ పావురం కాలికి ఓ తెల్ల కాగితం కట్టి ఉండడంతో దానిని పోస్ట్ కమాండర్ ఒంపాల్ సింగ్‌కు అందించాడు. 


ఆ కాగితంపై ఏవో నెంబర్లు రాసి ఉన్నాయి. దానిని కోడ్ భాషగా భావించిన అధికారులు పావురాన్ని బంధించారు. అయితే ఆ పావురం తనదేనని పాకిస్థాన్‌కు చెందిన గ్రామస్థుడు హబీబుల్లా తాజాగా తెలిపాడు. సరిహద్దుకు 4 కి.మి దూరంలో ఉన్న ఓ గ్రామంలో నివసిస్తున్న హబీబుల్లా ఈద్ పండగా సందర్భంగా ఆ పావురాన్ని ఎగరేశాడట. ఆ పావురం కాలికి కట్టి ఉన్న కాగితంపై రాసి ఉన్నది తన మొబైల్ నెంబర్ అని, అది ఎలాంటి కోడ్ లాంగ్వేజ్ కాదని తెలిపాడు. ఆ పావురాన్ని తనకు తిరిగి ఇప్పించాల్సిందిగా భారత ప్రధానికి విజ్ఞప్తి చేశాడు. 

Updated Date - 2021-04-22T18:22:36+05:30 IST