వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలి: పల్లా

ABN , First Publish Date - 2021-06-13T19:58:38+05:30 IST

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలి: పల్లా

విశాఖ: నగరంలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని అధికారులు కూల్చివేతలు చేపట్టారు. యాదవ జగ్గరాజుపేట చెరువు ఆనుకుని పల్లా శ్రీనివాస్‌కు చెందిన స్థలం పెన్సింగ్ అక్రమణ అంటూ అధికారులు తొలగించారు. సర్వే నెం. 14.1లో చెరువుకు చెందిన రెండడుగుల స్థలం ఆక్రమించి పెన్సింగ్ వేశారని అధికారులు చెబుతున్నారు. జాయింట్ సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలం ఉంటే తీసుకోవాలని పల్లా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు చెప్పినా అధికారులు అంగీకరించలేదు. ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని పల్లా కుటుంబసభ్యులు అన్నారు. కక్ష్య సాధింపులపై దృష్టి పెట్టడం మాని, అభివృద్ధిపై పెట్టాలని సూచించారు.

Updated Date - 2021-06-13T19:58:38+05:30 IST