YCP ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోంది: పల్లా శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-06-24T19:24:36+05:30 IST

వైసీపీ ప్రభుత్వం(YCP government) పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని విశాఖ(Visakha) పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

YCP ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోంది: పల్లా శ్రీనివాసరావు

Visakhapatnam : వైసీపీ ప్రభుత్వం(YCP government) పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని విశాఖ(Visakha) పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎవరైనా అరెస్ట్ చేయాలంటే ఒక రూల్ ఉంది.. కానీ పోలీసులు పాటించడం లేదన్నారు. సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పును పాటించడం లేదన్నారు. ఎవరి మీద అయినా ఎఫ్ఐఆర్ నమోదు అయితే.. ఆ విషయాన్నిపబ్లిక్ డొమైన్‌లో పెట్టాలన్నారు. అయ్యన్న కేసుల వివరాలన్నీ.. పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలన్నారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులు, వేధింపుల విషయంలో పోలీసుల వైఖరిని టీడీపీ లీగల్ సెల్ తీవ్రంగా తప్పు బట్టింది.


Updated Date - 2022-06-24T19:24:36+05:30 IST