వాయులింగేశ్వరుడి సేవలో పల్లంరాజు
ABN , First Publish Date - 2022-01-25T06:52:05+05:30 IST
వాయులింగేశ్వరుడి దర్శనార్థం సోమవారం మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు శ్రీకాళహస్తి విచ్చేశారు.
శ్రీకాళహస్తి, జనవరి 24: వాయులింగేశ్వరుడి దర్శనార్థం సోమవారం మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు శ్రీకాళహస్తి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకోగా వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి, స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో బియ్యపు ఆకర్ష్రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.