పల్లె ప్రకృతికి కేటాయించిన స్థలంలో నిర్మాణాల తొలగింపు

ABN , First Publish Date - 2020-12-03T05:08:50+05:30 IST

పల్లె ప్రకృతికి కేటాయించిన స్థలంలో నిర్మాణాల తొలగింపు

పల్లె ప్రకృతికి కేటాయించిన స్థలంలో నిర్మాణాల తొలగింపు
ఇంటి నిర్మాణాన్ని తొలగిస్తున్న ఎక్స్‌కవేటర్‌

ధారూరు: రాజాపూర్‌ గ్రామంలో పల్లె ప్రకృతి ఏర్పాటు కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. గ్రామ శివారులోని సర్వే నంబరు 101లోని ప్రభుత్వ భూమిలో పల్లెప్రకృతి వనం ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు 20 గుంటల స్థలం కేటాయించారు. కాగా ఈ భూమిలో అదే గ్రామానికి చెందిన అలీసాబ్‌, పక్రుద్దీన్‌, హన్మయ్య, బంటు కిష్టయ్య, కుర్వ నర్సింహులు. పి.నర్సింహులు, అనంతమ్మలు కబ్జాలో ఉండి  ఇళ్లు, పశువుల పాకల నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలంలో పల్లె ప్రకృతివనానికి కేటయించటంతో పంచాయతీ అధికారులు వారికి నోటీసులిచ్చారు. మంగళవారం రెవెన్యూ, పంచాయతీ అధికారులు పోలీసు బందోబస్తుతో ఈ స్థలంలో ఉన్న  నిర్మాణాలను ఎక్స్‌కవేటర్‌తోతొలగించి స్థలాన్ని పంచాయతీకి అప్పగించారు. కాగా తమకు ప్రభుత్వం గతంలో పట్టాలు ఇచ్చినందున ఇళ్లు, పశువుల పాకలు నిర్మించుకున్నామని తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపించిపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. 


Updated Date - 2020-12-03T05:08:50+05:30 IST