పల్లెప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-11-27T05:39:06+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం చే పట్టిన పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా నిర్వ హించాలని మండల ప్రత్యేకాధికారి సత్యనారాయ ణ ఆదేశించారు.

పల్లెప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించాలి
మొక్కలకు నీరు పడుతున్న ప్రత్యేకాధికారి

బాల్కొండ, నవంబరు 26: తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం చే పట్టిన పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా నిర్వ హించాలని మండల ప్రత్యేకాధికారి సత్యనారాయ ణ ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయేతర ప్ర త్యేక కార్యాచరణపై జలాల్‌పూర్‌లో గురువారం  నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ, పంట లు ఆరబెట్టుకునే కల్లాలను ప్రతీ రైతు సద్విని యోగపర్చుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని, కాల్వల్లో పూ డిక తొలగించాలన్నారు. రైతులు తమ పంట పొ లాలకు తగు మోతాదులోనే ఎరువులను  వినియోగించాలని అవగాహన కల్పించారు. పంట రు ణాలను సకాలంలో రెన్యువల్‌ చేసుకుని మాఫీని పొందాలన్నారు. అనంతరం పల్లె ప్రగతిలో నిర్వ హిస్తున్న వైకుంఠధామం డంపింగ్‌యార్డు, నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కల్పన, ఎంఈవో రాజే శ్వర్‌, ఏపీవో ఇందిర, కార్యదర్శి మహేష్‌, ఉప సర్పంచ్‌ లింబారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:39:06+05:30 IST