Palnadu: కన్నతల్లిపై కొడుకు కర్కశత్వం
ABN , First Publish Date - 2022-07-15T18:08:23+05:30 IST
జిల్లాలోని క్రోసూరు మండలం గుడిపాడులో కన్నతల్లిపై కొడుకు కర్కశత్వం ప్రదర్శించాడు.
పల్నాడు: జిల్లాలోని క్రోసూరు మండలం గుడిపాడులో కన్నతల్లిపై కొడుకు కర్కశత్వం ప్రదర్శించాడు. మరుగు దొడ్డి నిర్మాణం విషయంలో తల్లి అశ్రబీ(70)పై కొడుకు ఈసూబు దాడి చేశాడు. అడ్డుకోబోయిన కుటుంబసభ్యులపై ఈసూబు దౌర్జన్యం చూపాడు. తనకు చెందిన స్థలంలో తల్లి అశ్రబీ మరుగు దొడ్డి నిర్మాణం చేపట్టింది. అయితే దొడ్డి ఏర్పాటు చేయటానికి వీలులేదంటూ తల్లిపై ఈసూబు దాడి చేశారు. దీంతో తనకు రక్షణ కల్పించాలంటూ వృద్ధురాలు వేడుకుంటోంది.