Power cut: ప్రభుత్వ ఆఫీస్‌లకు విద్యుత్ సరఫరా నిలిపివేత

ABN , First Publish Date - 2022-07-21T17:43:30+05:30 IST

గురజాల నియోజకవర్గం ప్రభుత్వ ఆఫీస్‌లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Power cut: ప్రభుత్వ ఆఫీస్‌లకు విద్యుత్ సరఫరా నిలిపివేత

పల్నాడు: గురజాల నియోజకవర్గం ప్రభుత్వ ఆఫీస్‌లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాకాయిలు చెల్లించలేదంటూ అధికారులు విద్యుత్ సరఫరాను కట్ చేశారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు అంధకారంలో ఉండిపోయాయి. కరెంట్ లేకపోవడంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 


బకాయిలు ఎంతంటే... 

గురజాల మండలంలో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు 10 కోట్ల 20 లక్షలు.

దాచేపల్లి మండలంలో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు 16 కోట్ల 44 లక్షలు.

కారంపూడి మండలంలో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు 6 కోట్ల 78 లక్షలు.

రెంటచింతల మండలంలో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు 7 కోట్ల 21 లక్షలు.

Updated Date - 2022-07-21T17:43:30+05:30 IST