Palnaduలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

ABN , First Publish Date - 2022-07-06T18:04:38+05:30 IST

జిల్లాలోని సత్తెనపల్లి మండలం పాకాలపాడులో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

Palnaduలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి మండలం పాకాలపాడులో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాల విలీనాన్ని  విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఎస్సీకాలనీ ఎలిమెంట్రి స్కూలును ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనను విరమించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు సర్దిచెప్పేప్రయత్నం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-06T18:04:38+05:30 IST