వైభవంగా పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం
ABN , First Publish Date - 2021-04-19T06:11:30+05:30 IST
మండల పరిధిలోని పంపనూరు ఆలయంలో ఆదివారం చైత్ర శుద్ధ షష్టిని పురస్కరించుకొని సుబ్రహ్మ ణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఆత్మకూరు, ఏప్రిల్18 : మండల పరిధిలోని పంపనూరు ఆలయంలో ఆదివారం చైత్ర శుద్ధ షష్టిని పురస్కరించుకొని సుబ్రహ్మ ణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, ప్రత్యేక అలం కరణ చేశా రు. అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణాన్ని ఆలయ అ ధికారులు, అర్చకులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శాసో్త్రక్తంగా నిర్వహించారు.
అనంతపురం టౌన : చైత్రశుద్ధ షష్టిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని పలు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చెరువుకట్టపై వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రధానార్చకుడు ప్రసాద్ నంబూద్రి నేతృత్వంలో స్వామివారి మూలవిరాట్కు విశేష పూజలు చేశారు.