ఫైజర్ టీకాకు పనామా గ్రీన్ సిగ్నల్ !

ABN , First Publish Date - 2020-12-16T19:44:11+05:30 IST

అమెరికన్ ఔషధ సంస్థ ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కలిసి అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి పనామా ఆమోదం తెలిపింది.

ఫైజర్ టీకాకు పనామా గ్రీన్ సిగ్నల్ !

పనామా: అమెరికన్ ఔషధ సంస్థ ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కలిసి అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి పనామా ఆమోదం తెలిపింది. 2021 మొదటి త్రైమాసికంలో వ్యాక్సిన్ షిప్‌మెంట్ ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా అందిన వెంటనే మొదట హెల్త్ కేర్ వర్కర్స్, వయో వృద్ధులు, సెక్యూరిటీ సిబ్బందికి అందిస్తామని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇక 4.2 మిలియన్ల జనాభా గల పనామాలో ఇప్పటివరకు 1.94 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. 3,382 మందిని ఈ వైరస్ పొట్టనబెట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తున్న దేశాల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, సింగపూర్, కెనడా, మెక్సికోలతో పాటు గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్ కూడా ఫైజర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తాజాగా ఈ జాబితాలో పనామా చేరింది. కాగా, ప్రపంచంలోనే తొలిసారి ఫైజర్ వినియోగాన్ని ప్రారంభించింది మాత్రం బ్రిటన్. ఆ తర్వాత అమెరికా సోమవారం నుంచి వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు ఇవ్వడం ప్రారంభించింది.   

Updated Date - 2020-12-16T19:44:11+05:30 IST