పనసపండు దోశ
ABN , First Publish Date - 2021-01-23T16:48:12+05:30 IST
పనసపండు ముక్కలు - ఒక కప్పు, నూకలు - రెండు కప్పులు, పెరుగు - అరకప్పు, కొబ్బరితురుము - నాలుగు టేబుల్స్పూన్లు, బెల్లం - రెండు టేబుల్స్పూన్లు, ఉప్పు - తగినంత
కావలసినవి: పనసపండు ముక్కలు - ఒక కప్పు, నూకలు - రెండు కప్పులు, పెరుగు - అరకప్పు, కొబ్బరితురుము - నాలుగు టేబుల్స్పూన్లు, బెల్లం - రెండు టేబుల్స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: నానబెట్టిన నూకలను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. పనసపండు ముక్కలను ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ పైనుంచి దింపుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. మరొక పాత్రలో పావు కప్పు నీళ్లు పోసి బెల్లం వేయాలి. స్టవ్పై పెట్టి కొద్దినిమిషాలు చిన్న మంటపై బెల్లం కరిగించాలి. తరువాత ఒక పాత్రలో అర కప్పు నీళ్లు తీసుకుని అందులో పెరుగు, నూకల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పనసపండు పేస్టు, బెల్లం పానకం, కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలియబెట్టాలి. స్టవ్ పై పెనం పెట్టి కాస్త వేడి అయ్యాక దోశ పోసుకోవాలి. పలుచగా కాకుండా కాస్త మందంగా ఉండేలా చూసుకుంటే దోశలు బాగా వస్తాయి. కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. చట్నీతో తింటే ఈ దోశలు రుచికరంగా ఉంటాయి.