పంచలింగాల చెక్‌పోస్ట్‌ దగ్గర భారీగా బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-03-06T15:47:22+05:30 IST

అనుమతి లేకుండా తరలిస్తున్న బంగారాన్ని భారీ మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారనే విశ్వసనీయమైన సమాచారం పోలీసులకు అందింది.

పంచలింగాల చెక్‌పోస్ట్‌ దగ్గర భారీగా బంగారం పట్టివేత

కర్నూలు: అనుమతి లేకుండా తరలిస్తున్న బంగారాన్ని భారీ మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారనే విశ్వసనీయమైన సమాచారం పోలీసులకు అందింది. దీంతో పంచలింగాల చెక్‌పోస్టు దగ్గర వాహనాల తనిఖీలను పోలీసులు చేపట్టారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో అక్రమంగా తరలిస్తున్న.. రూ.5 కోట్ల విలువచేసే బంగారం, వెండి, 90 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేశారు. బంగారాన్ని, నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి కోయంబత్తూర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2022-03-06T15:47:22+05:30 IST