పీఆర్ఏఈ తీరుపై పంచాయతీ సభ్యుల ఆగ్రహం
ABN , First Publish Date - 2021-06-24T05:01:13+05:30 IST
మండలంలోని గుండ్లమాచునూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనానికి పంచాయతీరాజ్ శాఖ ఏఈ సురే్షకుమార్ ఇష్టారాజ్యంగా ఎంబీ రికార్డు చేశాడంటూ పంచాయతీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్లె ప్రకృతివనానికి రూ.6.30 లక్షలా అంటూ మండిపాటు
హత్నూర, జూన్ 23: మండలంలోని గుండ్లమాచునూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనానికి పంచాయతీరాజ్ శాఖ ఏఈ సురే్షకుమార్ ఇష్టారాజ్యంగా ఎంబీ రికార్డు చేశాడంటూ పంచాయతీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సర్పంచ్ జయంతిరెడ్డి అధ్యక్షతన పంచాయతీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామ కార్యదర్శి రామచంద్రారెడ్డి పంచాయతీ ఆదాయ వ్యయాల వివరాలు వివరిస్తుండగా, అందులో పల్లె ప్రకృతివననానికి రూ.6లక్షల30వేల వరకు చెల్లించినట్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అంతలోనే కొందరు సభ్యులు జోక్యం చేసుకొని సిమెంట్ కడీలు పాతి, ఇనుప జాలితో కూడిన ఫెన్సింగ్ వేయడానికి రూ.6లక్షల30వేలు ఎలా ఖర్చవుతాయని ప్రశ్నించారు. గతంలో కూడా సభ్యుల తీర్మానం చేయని పనులకు ఏఈ సురే్షకుమార్ ఎంబీ రికార్డు చేసి ఇచ్చారని ఆరోపించారు. పంచాయతీరాజ్ ఏఈ తీరుపై కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులకు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా సర్పంచ్ భర్త, గ్రామ కార్యదర్శి ఇద్దరు పంచాయతీ కార్యకలాపాలను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం పలు అభివృద్ధి పనుల కోసం తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ మన్నె శ్రీనివాస్, వార్డు సభ్యులు, కో-ఆప్షన్ నంబర్లు పాల్గొన్నారు.