పంచాయతీ కార్యదర్శికి అధికారుల నివాళి

ABN , First Publish Date - 2022-01-24T05:23:13+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం గోపాల్‌రెడ్డి నగర్‌కు చెందిన షేక్‌ మౌలాలి రెండో కుమార్తె లింగంగుంట సచివాలయ పంచాయతీ కార్యదర్శి షేక్‌ కరిష్మాభాను అంత్యక్రియల్లో తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలు అందరినీ కలచివేశాయి.

పంచాయతీ కార్యదర్శికి అధికారుల నివాళి
బుచ్చిలో కరిష్మాబాను పార్ధివదేహానికి నివాళులర్పిస్తున్న బుచ్చి కమిషనర్‌

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 23: బుచ్చిరెడ్డిపాళెం గోపాల్‌రెడ్డి నగర్‌కు చెందిన షేక్‌ మౌలాలి రెండో కుమార్తె లింగంగుంట సచివాలయ పంచాయతీ కార్యదర్శి షేక్‌ కరిష్మాభాను అంత్యక్రియల్లో తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలు అందరినీ కలచివేశాయి.  శనివారం సంగం మండలం కోలగట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కరిష్మాభాను దుర్మరణం చెందిన విషయం విదితమే. బుచ్చిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం గోపాల్‌రెడ్డినగర్‌లోని ఆమె నివాసానికి తీసుకువచ్చారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ గణేష్‌కుమార్‌, అనంతసాగరం ఎంపీడీవో మధుసూదన్‌రావు, బుచ్చి నగర కమిషనర్‌ శ్రీనివాసరావు,  అనంతసాగరం, బుచ్చి సచివాలయాల సిబ్బంది కరిష్మాభాను పార్ధివ దేహానికి నివాళులర్పించి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


Updated Date - 2022-01-24T05:23:13+05:30 IST