వల్లభనేని దాతృత్వం.. పంట కాలువలకు మోక్షం

ABN , First Publish Date - 2022-09-25T03:05:48+05:30 IST

మండలంలోని కరటంపాడు చెరువు కింద పొలాలకు సాగునీరు అందించే పంటకాలువలు అధ్వానంగా ఉన్నాయి. ఈ కాలువల కింద

వల్లభనేని దాతృత్వం.. పంట కాలువలకు మోక్షం
పంటకాలువల్లో పూడిక తీస్తున్న ఎక్స్‌కవేటర్‌

ఆత్మకూరు, సెప్టెంబరు 24: మండలంలోని కరటంపాడు చెరువు కింద పొలాలకు సాగునీరు అందించే పంటకాలువలు అధ్వానంగా ఉన్నాయి. ఈ కాలువల కింద సుమారు 200 ఎకరాలకుపైగా ఆయుకట్టు ఉంది. రైతుల కోరిక మేరకు ఆ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వల్లభనేని రాజేంద్ర తన సొంత నిధులు వెచ్చించి పంట కాలువల్లో పూడికతీతకు శనివారం శ్రీకారం చుట్టారు.  దాంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వల్లభనేని రాజేంద్ర మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా తన వంతు చేయూతనందిస్తునని తెలిపారు.  అలాగే భూసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-09-25T03:05:48+05:30 IST