పారా మెడికల్ కాంట్రాక్టు సిబ్బంది ధర్నా
ABN , First Publish Date - 2021-07-27T07:24:58+05:30 IST
కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరినీ రెగ్యులరైజ్ చేస్తామని గతంలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విశాఖపట్నం, జూలై 26(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరినీ రెగ్యులరైజ్ చేస్తామని గతంలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రజా ఆరోగ్య వైద్య, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆస్కార్రావు డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.