పారదర్శక పాలన అందించాలి

ABN , First Publish Date - 2021-10-27T03:20:28+05:30 IST

పంచాయతీల్లో పారదర్శక పాలన అందించాలని డీఎల్‌పీవో వెంకటరమణ కోరారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళ

పారదర్శక పాలన అందించాలి
వార్డు నెంబర్లకు శిక్షణ పత్రాలను అందజేస్తున్న డీఎల్‌పీవో వెంకటరమణ, తదితరులు

కోట, అక్టోబరు 26 : పంచాయతీల్లో పారదర్శక పాలన అందించాలని డీఎల్‌పీవో వెంకటరమణ కోరారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం 92 మంది వార్డు సభ్యులకు శిక్షణ పొందిన పత్రాలను డీఎల్‌పీవో వెంకటరమణ,  ఇన్‌చార్జి ఎంపీడీవో స్వరూపారాణిలు అంద జేశారు. ఏడు పంచాయతీ వార్డు సభ్యులను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డీఎల్‌పీవో మాట్లాడుతూ పంచాయతీలను ఆదర్శంగా నిలపడంలో  వార్డు నెంబర్లు ఎనలేని కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ అఽధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T03:20:28+05:30 IST