ఏడాదిన్నర చిన్నారిని ఇంటి దగ్గరే వదిలేసి పొలం పనులకు వెళ్లారు.. తిరిగి వచ్చేసరికి జరిగిన ఘోరం ఏంటంటే..

ABN , First Publish Date - 2021-11-29T18:09:18+05:30 IST

చిన్న పిల్లలకు ఊహ తెలిసే వరకు ఎల్లవేళలా వారిని కనిపెట్టుకునే ఉండాలి.

ఏడాదిన్నర చిన్నారిని ఇంటి దగ్గరే వదిలేసి పొలం పనులకు వెళ్లారు.. తిరిగి వచ్చేసరికి జరిగిన ఘోరం ఏంటంటే..

చిన్న పిల్లలకు ఊహ తెలిసే వరకు ఎల్లవేళలా వారిని కనిపెట్టుకునే ఉండాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు చేసే చిన్న తప్పు కూడా చిన్నారుల ప్రాణాలను బలిగొంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అలాంటి ప్రమాదమే జరిగింది. ఏడాదిన్నర చిన్నారిని ఇంటి దగ్గరే వదిలేసి పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు అందుకు భారీ మూల్యం చెల్లించారు. ఆ చిన్నారిని కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


తుకామ్‌పూర్ ప్రాంతానికి చెందిన భీమ్‌సింగ్ అతని భార్య ఆదివారం సాయంత్రం తన ఏడాదిన్నర పాప నవ్యను ఇంటి వద్దే వెళ్లి పొలం పనులకు వెళ్లారు. ఇంటి దగ్గరే ఉన్న చిన్నారి ఆడుకుంటూ నీరు నిండుగా ఉన్న బకెట్‌లో తలకిందులుగా పడిపోయింది. ఎవరూ చూడకపోవడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. పొలం పనుల నుంచి తిరిగి వచ్చిన భీమ్‌సింగ్ బకెట్‌లో పడిపోయి ఉన్న నవ్యను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 

Updated Date - 2021-11-29T18:09:18+05:30 IST