America లో బిడ్డల పెళ్లి.. ఆంధ్ర నుంచి ఆన్లైన్లో తల్లిదండ్రుల ఆశీస్సులు!
ABN , First Publish Date - 2021-09-05T15:06:27+05:30 IST
అమెరికాలో జరిగిన పెళ్లి వేడుకలను గుంటూరు జిల్లా వినుకొండలో నుంచి తల్లిదండ్రులు నూతన వధూవరులను ఆశీర్వదించిన వినూత్న సంఘటన పట్టణంలో చర్చనీయాంశమైంది.
అమెరికాలో బిడ్డల పెళ్లికి ఆన్లైన్లోనే ఆశీస్సులు!
కరోనా కారణంగా వెళ్లలేకపోయిన ఇరుకుటుంబాలు
వినుకొండ టౌన్, సెప్టెంబరు 4: అమెరికాలో జరిగిన పెళ్లి వేడుకలను గుంటూరు జిల్లా వినుకొండలో నుంచి తల్లిదండ్రులు నూతన వధూవరులను ఆశీర్వదించిన వినూత్న సంఘటన పట్టణంలో చర్చనీయాంశమైంది. స్థానిక నరసరావుపేట రోడ్డులో నివాసం ఉంటున్న తేళ్ల వెంకట కృష్ణారావు, శాంతిల కుమారుడు గ్రీష్మంత్ గోల్డ్, ఒంగోలుకు చెందిన కొమ్మాలపాటి శ్రీరామమూర్తి, శోభారాణిల కుమార్తె అనుజ్ఞ వివాహాన్ని అమెరికాలోని డల్లా్సనగర్లో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. అయితే కరోనా కారణంగా ఇరుకుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు అమెరికా వెళ్లలేకపోయారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానంతో భారీ స్ర్కీన్ ఏర్పాటు చేసి.. లైవ్లో పెళ్లి వేడుకలను వీక్షించి వధూవరులను ఆశీర్వదించారు.