టీటీడీపై శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఫైర్

ABN , First Publish Date - 2022-04-27T22:41:33+05:30 IST

టీటీడీపై శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఫైర్

టీటీడీపై శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఫైర్

తిరుమల: టీటీడీపై శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఫైర్ అయ్యారు. భక్తులకు సౌకర్యాల కల్పనలో టీటీడీ విఫలమైందని పరిపూర్ణానంద స్వామి మండిపడ్డారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నా టీటీడీ ఇప్పటివరకు పందిళ్ళు వేయకపోవడం బాధాకరమన్నారు. వసంతోత్సవం, సహస్ర కళశాభిషేకంను టీటీడీ రద్దు చేసిందన్నారు. స్వామివారికీ నిర్వహించే సేవలను రద్దు చేసే హక్కు టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఇలానే చేసుకుంటూపోతే రాబోయే రోజుల్లో శ్రీవారి దర్శనాన్ని కూడా రద్దు చేస్తారని పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-27T22:41:33+05:30 IST