Sajjala Ramakrishna: పరామర్శలు సెలబ్రేషన్స్ లాగా చేస్తారా..?.. చంద్రబాబుపై ఫైర్
ABN , First Publish Date - 2022-07-21T23:40:56+05:30 IST
వైసీపీ (Ycp) అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవహారాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించిందని...
అమరావతి: వైసీపీ (Ycp) అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవహారాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishnareddy) అన్నారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి చూసి ఓర్వలేని వారే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ (Parliament) వేదికగా టీడీపీ చేసిన అప్పులపై కేంద్రమంత్రి ప్రకటన చేశారని గుర్తు చేశారు. లెక్క, పత్రం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసిందని కేంద్రమంత్రి చెప్పారని సజ్జల తెలిపారు. 1986లో ఎన్టీఆర్ (Ntr) ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు చెప్పిన అబద్ధాలు ఇప్పుడు చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. వరద బాధితులను చంద్రబాబు (Chandrababu) పరామర్శలకు కూడా సెలబ్రేషన్స్ లాగా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై బాధ్యతారాహిత్యంగా కొందరు వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.