టీడీపీ డీఎన్ఏలోనే బీసీల పట్ల వ్యతిరేకత ఉంది : పార్థసారధి
ABN , First Publish Date - 2021-11-23T19:55:09+05:30 IST
బీసీ జనగణన తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. టీడీపీ డీఎన్ఏలోనే బీసీల పట్ల వ్యతిరేకత ఉందన్నారు.
అమరావతి : బీసీ జనగణన తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. టీడీపీ డీఎన్ఏలోనే బీసీల పట్ల వ్యతిరేకత ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బలహీన వర్గాలపై ప్రేమ ఉంటే వ్యక్తిగత రాగ ధ్వేషాలను పక్కన పెట్టి ఈరోజు వచ్చి ఉండేవారన్నారు. కేంద్రంలోని బీజేపీ, గతంలో ఉన్న కాంగ్రెస్లు ఈదిశగా ప్రయత్నించలేదన్నారు. ఎందుకు బీసీ జనగణనకు అంగీకరించడం లేదో బీజేపీ చెప్పాలని పార్థసారధి ప్రశ్నించారు.